మార్కెట్ విస్తరణతోనే మనుగడ
మన దేశం నుంచి అక్వా ఎగుమతుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తోంది. రాష్ట్ర వృద్ధి రేటులోనూ ఈ రంగం కీలకభూమిక పోషిస్తోంది.
ముమ్మిడివరం : మన దేశం నుంచి ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తోంది. రాష్ట్ర వృద్ధి రేటులోనూ ఈ రంగం కీలకభూమిక పోషిస్తోంది. నిలకడలేని ధరలు రొయ్య రైతును కుదేలు చేస్తున్నాయి. ఎగుమతి సుంకాలు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా మారే డాలర్ విలువను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఎగుమతులు కొన్ని దేశాలకే పరిమితం కావడంతో ధరలకు భరోసా లేకుండా పోతోంది.
ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని....
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 72,000 ఎకరాల్లో వెనామీ సాగు జరుగుతోంది. సుమారు 1.04 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు వంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఏటా 2.01 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేసి ఎగుమతుల్లో అగ్రభాగాన -నిలుస్తున్నారు. ఆక్వా ఉత్పతుల్లో ప్రధానంగా వనామీ రొయ్యల ధరలు అమెరికా, చైనా మార్కెట్లపైనే ఆధారపడుతున్నాయి. దేశీయంగా వీటి వినియోగం తక్కువ కావడంతో ఎగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యేవాటిలో 35 శాతం ఆమెరికా, 20 శాతం చైనా, 14 శాతం జపాన్, వియత్నాం, థాయ్లాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల అమెరికా సుంకాలు ఆక్వా పరిశ్రమను ఓ కుదుపు కుదిపేశాయి. తర్వాత తాత్కాలికంగా వాయిదా వేసినా. ఇంకా మార్కెట్ కుదుటపడలేదు. కొవిడ్ సమయంలో చైనా పదుల సంఖ్యలో రొయ్యల కంటైనర్లను వెనక్కి పంపించి ఎగుమతులు నిలిపి చేయడంతో రైతులు రూ. కోట్లలో నష్టపోయారు.
ఎగుమతుల విషయంలో..
అమెరికా, చైనాకు ఎగుమతుల విషయంలో ఎదురవుతున్న పరిణామాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లు అవసరం. రష్యా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆక్వా ఉత్పతులు దిగుమతి చేసుకునే అవకాశం ఉండటంతో ఆయా దేశాలకు ఎగుమతులపై కేంద్రం దృష్టి సారించినట్లు -తెలుస్తోంది. ఆక్వా సమస్యలను రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చిస్తాం.
ధరల స్థిరీకరణకు చర్యలు
-సత్యనారాయణరాజు, ఆక్వా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఆక్వా సాగులో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఇటీవల అమెరికా సుంకాల పెంపు నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఎగుమతిదారులతో చర్చలు జరిపి ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. ఆక్వా రంగం స్థిరత్వం సాధించడానికి ప్రభుత్వం ఆధ్యయన కమిటీ వేసింది.
ఉమ్మడి జిల్లాలో ఆక్వా ఇలా..
శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి
చెరువుల విస్తీర్ణం 72,000 ఎకరాలు
రైతులు 104 లక్షలు
ఏటా ఆక్వా ఎగుమతులు - 2.01 లక్షల టన్నులు
హేచరీలు 194
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు 14