For Advertisement Enquiries Please Contact +91 7901268899

మళ్లీ ధరల పతనం

img

మళ్లీ ధరల పతనం..!
ముమ్మిడివరం వాతావరణంలో మార్పులు, వ్యాధుల విజృంభణ కారణంగా రొయ్యల చెరు వులు ఖాళీ అవుతున్నాయి. అమె రికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంపు అంశం తెరమీదకు రాక ముందు మీసం మెలేసిన రొయ్య ధరలు అమాంతం పడిపోగా, తర్వాత సుంకాల గడువు పెంపు,
ప్రభుత్వ చర్చలతో కొంత మెరుగుపడింది. ప్రస్తుతం ధరలు పతనం దిశగానడుస్తున్నాయి.
విదేశీ మారక ద్రవ్యం
జిల్లాలో 39 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగు తోంది. గతంలో వేసవి వచ్చే సరికి చెరువులు పూర్తిగా ఎండగట్టి రైతులు జూన్,జులై మాసాల్లో సాగు చేపట్టేవారు. ప్రస్తుతం సమయంతో పని లేకుండా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చెరువుల పట్టుబడులు జరగుతున్నాయి. వందల మెట్రిక్ టన్నుల రొయ్యల్ని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఏటా10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా  రైతులు దిగుబడులు సాధించి విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.
మళ్లీ నేలచూపులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో రొయ్యలపై దిగ మతి సుంకం భారీగా పెంచడంతో
రొయ్యల ధరలు పతనమయ్యాయి. తర్వాత ప్రభుత్వం ఆదేశాలతో ధరను కొంతకాలం స్థిరంగా ఉంచారు. ప్రస్తుతం మూడు రోజులుగా 100 కౌంట్ రొయ్యల ధర కిలోకు రూ.10 తగ్గి రూ.210కు చేరింది. టన్నుకు రూ.10 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
వ్యాధుల విజృంభణ..
తీవ్రంగా ఎండలు కాయడం, అల్పపీడన ప్రభా వంతో ఉష్ణోగ్రతలు పడిపోవడం వంటి మార్పులతో వ్యాధులకు మరింత బలం చేకూరుతోంది. ఆక్వా సాగులో తెల్లమచ్చ తెగు లుతో పాటు వైట్ గట్ కలవర పెడుతోంది. ఇటీవల విబ్రియో, ఈ హెచ్పీ వ్యాధి విజృంభిస్తోంది. ప్రస్తుతం చెరువుల్లో రొయ్యలకు వైట్ ఫీసెస్ (తెల్ల రెట్ట వ్యాధి)
వైట్ గట్ (తెల్ల పేగు) వ్యాధి, విబ్రియో, ఈహెచ్పీ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీని నివారణకు రైతులు రకరకాల మందులు వినియోగించడం, మేత చల్లడం చేసినా ప్రయోజనం ఉండటం లేదు. పెట్టుబడులు పెరిగిపోవడం మినహా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో రైతులు రొయ్యలు ఏ కౌంట్ ఉన్నా.. పట్టుబడి పట్టక తప్పడం లేదు. 
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
రొయ్యల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చెరువుల్లో రొయ్యపిల్లలు వేసిన నుంచి పట్టుబడి వరకు అష్టకష్టాలు పడుతున్నాం. ధరలు ఎప్పుడు.. ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. 100 కౌంట్ ధర కిలో రూ.240 వరకు ఉండేది. అమెరికా సుంకాల అంశం వచ్చాక ధర పతనమైంది. కనీసం రూ.220 చెల్లించాలని ప్రభుత్వం సూచించినా క్షేత్ర స్థాయిలో రూ.200 సైతం ఇవ్వడం లేదు.
-ఎం.వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు. 
source:eenadu konasem dist
www.aquall.in

Languages

Shares

Related News