For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఇక్కడా అవే కష్టాలు

img

ఇక్కడా అవే కష్టాలు
విత్తు నాటే సమయానికి సాగునీరు లేక.. పంట కోసే వేళ ముంచెత్తే వానలతో వరి సాగు వదిలేసి ఆక్వా వైపునకు అడుగులు వేసిన రైతులకు అక్కడా..అవేకష్టాలు ఎదురవుతున్నాయి.

విత్తు నాటే సమయానికి సాగునీరు లేక.. పంట కోసే వేళ ముంచెత్తే వానలతో వరి సాగు వదిలేసి ఆక్వా వైపునకు అడుగులు వేసిన రైతులకు అక్కడా.. అవే కష్టాలు ఎదురవుతున్నాయి. వేసవిలో ఎడతెరపి లేని వర్షాలకు సాగుదారులు విలవిల్లాడుతున్నారు. ప్రాణవాయువు అందక ఈదుతున్న రొయ్యలను కాపాడుకోలేక తల్లడిల్లుతున్నారు. ఆకస్మిక పట్టుబడులతో నష్టాల బారిన పడుతున్నారు. మరో వారం రోజులు వర్ష సూచన ఉండటంతో రైతులకు కంటిమీద కునుకు ఉండటంలేదు.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు విపరీతమైన వేడి.. అంతలోనే చల్లదనం రొయ్యలను వణికిస్తోంది. ఎండ కాస్తుండగానే
జోరున వర్షం పడుతుండటంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. రెండు, మూడు రోజులపాటు అలాంటి పరిస్థితి ఉంటే సరకు మృత్యువాత పడిపోతుంది. అలాంటిది ఏకధాటిగా 20 రోజుల నుంచి వాతావరణం తేడాగా ఉండటంతో ఆకస్మికంగా పట్టుబడి చేయాల్సి వస్తోందని ఆక్వా రైతులు వాపోతున్నారు.
కలుషిత నీటితో ఇక్కట్లు
సీడులో నాణ్యత లేకపోవడంతో అవసరానికి మించి చెరువులో వదులుతున్నారు. వేసిన రొయ్య పిల్ల ఎంత సంఖ్య కాస్తుందో అంచనా లేక వేసినంత పిల్లకు మేత, మందులు వేసేస్తుంటారు. దీంతో చెరువులో ఉన్న రొయ్యలు తినగా మిగిలిన మేత చెరువు అడుగు భాగంలోకి దిగిపోయి.. నీటిని కలుషితంగా మారుస్తోంది. దీనికి తోడు నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం ఆందోళన కలిగిస్తోంది.
200 కౌంటుకే పట్టుబడి
పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో కనీసం 100 కౌంటుకు చేరి.. ఆశించిన సరకు చేతికొస్తే నష్టాలు చవిచూడకుండా బయటపడొచ్చు. అకాల వర్షాలతో 200, 150 కౌంటులోనే రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో అపార నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. వారంరోజుల కిందట వరకు రూ.230 ఉన్న 100 కౌంటు, కిలో ధర రూ.225కి పడిపోయింది. క్షేత్రస్థాయిలో దానికి మరో రూ.5, 10 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 100 కౌంటు ధర ఆధారంగా 200, 150 కౌంటుకు ధర నిర్ణయించడంతో రైతులు కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు

Languages

Shares

Related News