గణపవరం : పూటకొరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది .ఇటీవల దారుణంగా పడిపోయిన చేపలు , రొయ్యల ధరలు పెరిగి ఆక్వా రంగం కొద్దిగా కుదుటపడుతున్న సమయంలో పదిరోజులుగా వాతావారణ మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి . విపరీతమైన ఎండలు మబ్బులు కమ్మి , వర్షం జల్లులు మరోపక్క ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి . ఈ సమస్యలకు తోడు ఎడాపెడా విధిస్తున్న విధ్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి . ఆయిల్ ఇంజినల్ వినియోగానికి రోజూ వేళల్లో డిజిల్కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
అర్ధాంతరంగా చేపలు , రొయ్యల పట్టివేత
ఎండకాస్తే విపరీతమైన ఉక్కబోత .. అప్పటికప్పుడు ఉన్నట్టుండి ఎండమాయమై , మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ సమస్య తలెత్తి చెరువుల్లో చేపలు , రొయ్యలు మూతులు పైకెత్తి నీటి ఉపరితలంపై అసహనంగా తిరుగాడుతున్నాయి .కొన్ని చోట్ల చేపలు , రొయ్యలు చనిపోయి నీటిపై తేలుతున్నాయి .ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం చెరువుల్లో ఏరియేటర్లను తిప్పుతున్నారు .చెరువుల్లో ఇంజన్స్ వేసి నీటిని రీసైక్లింగ్ చేస్తూ నిరంతరం నీటిలో కదలికలు తేవడం వాళ్ళ ఆక్సిజన్ అందకచేపలు , రొయ్యలు మేతలుసరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు యుద్ధప్రాతిపదికన పట్టివేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు .ఉమ్మడి జిల్లాలో సుమారు 1 .25 లక్షల ఎకరాల్లో రొయ్య , మరో 1 .50 లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది . వాతావరణ ప్రతికూలంగా మారడంతో నియోజక వర్గంలో దాదాపు నాలుగువేల ఎకరాల్లో చేపలు , రొయ్యలు అర్ధాంతరంగా పట్టివేసినట్లు అంచనా .
నిరంతరం ఏరియేటర్స్ తిప్పాలి .చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లను తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు .ఆక్సిజన్ లోపనివారణ పొటాషియం పార్మాగానేటు సిద్ధంగా ఉంచుకొని , అవసరం మేరకు చెరువుల్లో చల్లుతుందన్నారు . ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు , రొయ్యలు మేతలుసరిగా తినని కారణంగా పరిమితంగా మేతలువేస్తుండాలని , ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెరువుల్లో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానివేయాలనిసూచించారు .
విపరీతమైన ఎండలు , అకాల వర్షాలతో అనర్ధం ఒక పక్క ఉక్కపోత ... మరో పక్క విధ్యుత్ కోత