ఆక్వా రంగం స్థిరత్వానికి ప్రభుత్వ కృషి
• నెక్' తరహాలో ఏపీపీపీసీ ఏర్పాటుకు ప్రతిపాదన
ఉప సభాపతి రఘురామ, అప్పడా కో-వైస్ ఛైర్మన్ వెంకటరమణారెడ్డిల వెల్లడి
ఈనాడు, అమరావతి: సవాళ్లు అధిగ మించి.. ఆక్వా రంగం స్థిరత్వం సాధించడానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నియమించిన అధ్య యన కమిటీ సిఫార్సు చేసిందని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొ న్నారు. రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయంలో ఆనం వెంకట రమణారెడ్డి, భాజపా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో కలిసి విలేకర్ల సమావే శంలో బుధవారం మాట్లాడారు. పదెకరాల నిబంధనతో సంబంధం లేకుండా ఆక్వా రైతు లకు రూ.1.50కే విద్యుత్తు ఇచ్చే నిర్ణయంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు జీఎస్టీ మినహాయింపు అంశాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసు కెళతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) కో-
వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లా డుతూ.. "అధ్యయన కమిటీతో 18 సమావే శాలు నిర్వహించి, కీలక అంశాలు చర్చించాం. కమిటీ సిఫార్సుల్లో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు, బ్రూడ్ స్టాక్, మేతలపై దిగుమతి సుంకాలను తగ్గించడం, స్థానికంగా వినియోగం పెంచడా నికి ధరల స్థిరీకరణ, నాణ్యమైన సరకు అందిం చడం తదితర నిర్ణయాలున్నాయి. కిలో రూ. 109గా ఉన్న రొయ్యల మేత ధరను రూ.94కి తగ్గించి జులై 1 నుంచి అమల్లోకి వచ్చేలా చేశాం. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) తరహాలో ఏపీ రొయ్యల ఉత్పత్తిదారుల కంపెనీ (ఏపీపీపీసీ) ఏర్పాటుకు ప్రతిపాదించాం. ఇందుకు అవసరమైన నిధులను ఆక్వా భాగ స్వాముల నుంచి రూ.40 కోట్ల మేర సమీకరిం చాలని ప్రతిపాదించాం. రాష్ట్రంలోని 2.07 లక్షల ఆక్వా చెరువులు, 3,800 ఆక్వా కల్చర్ వ్యాపార యూనిట్లను జియోట్యాగింగ్ చేసి, వాటికి కోడ్లు కేటాయించాం' అని వివరించారు.