కొద్దీ రోజులుగా నెలకొన్న అనూహ్య వాతావరణ పరిస్ధితులు చేపలు , రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం
ఆకివీడు , న్యూస్ టుడే: కొద్దీ రోజులుగా నెలకొన్న అనూహ్య వాతావరణ పరిస్ధితులు చేపలు , రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి .పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో ఆదివారం ఉదయం ఈదురుగాలుతో భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లోని చెరువుల్లో ప్రాణవాయుని స్ధాయిలు పడిపోయి చేపలు కళ్ళు తేలేస్తున్నాయి.రొయ్యలు ఉక్కిరిబిక్కిరి వుతున్నాయి .చెరువుల్లో ప్రాణవాయువు స్ధాయిని పెంచేందుకు సాగుదారులు అన్ని యత్నాలు చేసిన ఫలితం లేకపోవడంతో డెల్టా , కొల్లేరు తీరప్రాంతాల్లో హడావిడిగా పెట్టుబడులు చేయాల్సి పరిస్ధితి నెలకొంది .
అనువైన కాలంలోనూ ....
రొయ్యల సాగుకు వేసవి అనుకూలమని రైతులు భావిస్తారు . వ్యాధుల తీవ్రత పెద్దగా ఉండదని దిగుబడి బాగుంటుందనే ఆశతో ఎక్కువ విస్టీర్ణంలో సాగుకు ఉపక్రమిస్తారు . కానీ వాతావరణ మార్పుల కారణంగా ఈ సీజన్లో వైరస్ లు వైట్ గట్ వ్యాప్తి పెరిగినట్లు రైతులు చెబుతున్నారు .సాగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది . వ్యాధుల నివారణకు మందులు , రసాయనాలు చల్లేందుకు అదనపు భారం పడుతోంది . దేంతో సాగు వ్యయం పెరిగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
విధ్యుత్ అంతరాయాలతో ....
రొయ్యల చెరువుల్లో ప్రాణవాయువు స్థాయి స్థిరంగా ఉండేలా నిరంతరాయంగా అయేటర్స్ తిప్పాలి . కానీ కొద్దిపాటి గాలివేసినా , వర్షం కురిసినా విధ్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారు .ఇలాంటి సమయంలో చెరువులు ప్రాణవాయువు స్థాయి పడిపోతుండటంతో జనరేటర్లను వినియోగించాల్సి వస్తోంది .జనరేటర్ ఇంధన ఖర్చులతో కలిపి సాగు వ్యయం తడిసిమోపుడవుతుంది .ఇంట చేసిన ఆశించిన స్ధాయి దిగుబడి లేక సాగుదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది .
బీమా వర్తింపజేయాలి
ఏప్రిల్ చివరి వారం నుంచి ప్రతికూల వాతావరణం కొనసాగుతుండంతో సాగులో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాము .రొయ్యల చెరువ్వుల్లో ప్రాణవాయువు సమస్య ఉత్పన్నమవుతోంది .నిరంతరాయంగా ఏరియేటర్లను తిప్పుతూ చెరువుల వద్దే కాపలా ఉంటున్నాం దీనికితోడు వ్యాధుల వ్యాప్తి పెరిగింది .ఈ పంటకు బీమా సదుపాయం కల్పిస్తే సాగుదారులకు మేలు జారుతుంది .