For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వా పార్కు నిర్మాణంలో కదలిక

img

ఆక్వా పార్కు నిర్మాణంలో కదలిక
జిల్లాలో నిజాంపట్నం మండలం దిండి వద్ద నిర్మించనున్న సమీకృత ఆక్వాపార్కు నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. పనులకు టెండర్లు పిలిచారు.

జిల్లాలో నిజాంపట్నం మండలం దిండి వద్ద నిర్మించనున్న సమీకృత ఆక్వాపార్కు నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. పనులకు టెండర్లు పిలిచారు. అవి ఖరారు కాగానే సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆక్వా పార్కు నిర్మాణానికి రూ.88 కోట్లతో డీపీఆర్ సిద్దం చేసి కేంద్రానికి పంపించగా ఇటీవల అనుమతులు, నిధులు మంజూరయ్యాయి.
జిల్లాలో రొయ్యలు, పీతలు, పండుగప్పల హేచరీలు లేవు. రైతులకు నాణ్యమైన పిల్లలు లభించటం లేదు. జిల్లా రైతులు తమిళనాడు, పాండిచ్చేరి తదితర దూరప్రాంతాల నుంచి పిల్లలు తెస్తున్నారు. ఆక్వా ఎగుమతులు పెంచి ఆదాయం రెట్టింపు చేయటానికి జిల్లాలోని దిండి వద్ద సమీకృత అక్వా పార్కు నిర్మించాలని నిర్ణయించారు. 60 శాతం నిధులు కేంద్రం ఇవ్వనుండగా 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. రాష్ట్రానికి 2020లోనే ఈ ప్రాజెక్టును కేంద్రం కేటాయించినా భూ కేటాయింపులో అప్పటి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2022 డిసెంబరులో దిండి వద్ద 280 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మే 16న నిజాంపట్నం నుంచి వర్చువల్గా అప్పటి సీఎం జగన్ ఆక్వా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండుదశల్లో రూ. 188 కోట్లు ఖర్చు చేయాలని అంచనాలు రూపొందించారు. మొదటి దశలో పండుగప్పలు, పీతలు, రొయ్యల హేచరీలు, సముద్ర నాచు, సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ ప్లాంటు, రంగుల అలంకరణ చేపలు, నీటిశుద్ధి ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కేంద్రం తన వాటా కింద నిధులు విడుదల చేసినా వైకాపా ప్రభుత్వం నిర్మాణ పనులు ప్రారంభించలేదు. నిధులు ఖర్చు చేయకపోవటంతో వెనక్కిపోయాయి.అక్వా పార్కుకు కేటాయించిన భూమిలో మడ అడవులు, సముద్రపు భూములు ఉన్నాయి. పర్యాటక రంగాభివృద్ధి కోసం 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. వర్గీకరణ జరగకపోవటంతో మత్స్యశాఖకు భూములు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మడ అడవులను తొలగించి 192 ఎకరాలకు ఆక్వా పార్కు కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా అనుమతులు ఇచ్చి నాలుగేళ్లు పూర్తయినందున తాజాగా ఆక్వా పార్కు నిర్మాణానికి మళ్లీ అంచనా వ్యయం రూపొందించి ప్రతిపాదనలు పంపించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. అంచనా వ్యయం రూ.88.08 కోట్లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రూ.52.85 కోట్లు రానుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.35.23 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కొత్తగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేయించారు.
జిల్లాలో కీలకమైన ఆక్వారంగ ప్రగతికి సమీకృత పార్కు ప్రాజెక్టు కీలకం. అయితే నిర్మాణ పనులు వేగంగా చేయాల్సి ఉంది. ప్రాజెక్టుకు కేటాయించిన భూములు చేపలు, రొయ్యల చెరువులుగా ఉన్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించాలంటే తొలుత భూమి చదును చేయాలి. తుపానులు, వాయుగుండాల ప్రభావంతో తీరంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు తరచూ భారీ వర్షాలు కురుస్తాయి. ఈ లోగానే నిర్మాణ సామగ్రి తరలించి పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా ఇన్ఛార్జి. మత్స్యశాఖాధికారి కృష్ణకిశోర్ మాట్లాడుతూ మారిటైమ్ బోర్డు ద్వారా ఆక్వా పార్కు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
Source: eenadu 
www.aquall.in

Languages

Shares

Related News