రొయ్య ఎదగదు.. గిట్టుబాటు ధర దక్కదు
డాలర్ సేద్యంగా పేరొందిన ఆక్వా రంగాన్ని వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలుత రొయ్యలకు వైరస్ తాకిడి
పెరిగింది. ఆ తరువాత అమెరికా సుంకాల భయం వెంటాడింది. మూడు నెలల పాటు వీటిని వాయిదా వేయడంతో కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో మరో కొత్తచిక్కు వచ్చి
పడింది.
డాలర్ సేద్యంగా పేరొందిన ఆక్వా రంగాన్ని వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలుత రొయ్యలకు వైరస్ తాకిడి పెరిగింది. ఆ తరువాత అమెరికా సుంకాల భయం వెంటాడింది. మూడు నెలల పాటు వీటిని వాయిదా వేయడంతో కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో మరో కొత్తచిక్కు వచ్చి పడింది. రొయ్యలు ఎంత మేత తిన్నా దానికి తగినట్లు పెరుగుదల లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణం మార్పులతో కలిసిరాని వనామీ
గత కొన్నాళ్లుగా వనామీ రొయ్య సాగు కలిసిరావడం అ లేదు. వాతావరణం స్థిరంగా లేకపోవడంతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. గతంలో వంద రోజులకు 40 కౌంట్కు చేరుకునేవి. మేత కూడా తక్కువగానే వినియోగం అయ్యేది. ప్రస్తుతం 120 రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో అదనపు వ్యయం అవుతోంది. అన్నీ సక్రమంగా కలిసి వచ్చి చెరువుల్లో సీడ్ వేసిన తరువాత ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే 130 రోజులకు పట్టుబడికి వస్తున్నాయి. రూ. లక్షల్లో అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
సగానికి పడిపోయిన బరువు
ప్రస్తుతం చెరువుల్లో 45 నుంచి 60 రోజుల పంటలు సాగులో ఉన్నాయి. 60 రోజులకు రొయ్య బరువు 10 నుంచి 12 గ్రాముల వరకు ఉండాలి. ప్రస్తుతం కేవలం నుంచి 6 గ్రాముల వరకు మాత్రమే బరువు తూగుతున్నాయిని రైతులు వాపోతున్నారు.
పెరుగుతున్న మేత వినియోగం
చెరువుల్లో రొయ్య పిల్లలు వేసిన మొదట్లో మేత వినియోగం తక్కువగానే ఉంటుంది. నెల రోజులు దాటిన తరువాత రోజుకు నాలుగుసార్లు మేత వేస్తారు. ఎకరా విస్తీర్ణం గల చెరువులో 1.50 లక్షల వరకు సీడ్ వేస్తున్నారు. వీటికి రోజుకు 60 నుంచి 70 కేజీల వరకు మేత వేయాల్సి ఉంటుంది. 100 నుంచి 110 రోజుల్లో పట్టుబడికి వస్తే రైతుకు మిగలుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అదనంగా 20 నుంచి 30 రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో 20 టన్నుల మేత అదనంగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టన్ను మేత సుమారు రూ.9 వేల వరకు ఉంటుంది. అదనంగా రూ.1.80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హేచరీల్లో పిల్లల ఉత్పత్తికి వినియోగించే తల్లి రొయ్య అనేకసార్లు వినియోగించడంతో పిల్లల్లో నాణ్యత తగ్గి ఎదుగుదల లోపం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా వివరాలు ఇలా..
ఆక్వాసాగు: 48 వేల ఎకరాలు
రైతులు : 28 వేల మంది
ప్రస్తుతం సాగులో ఉన్నవి: 35 వేల ఎకరాలు
నాణ్యమైన సీడ్ ఎంచుకోవాలి
రైతులు చెరువుల్లో వేసేందుకు నాణ్యమైన సీడ్ను
ఎంచుకోవాలి. అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి, మంచి లాభాలు పొందొచ్చు.
- శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి