కలిసిరాని రొయ్యల సాగు
అమెరికాలో దిగుబడి సుంకాలు పెంచుతారన్న సమాచారంతో ఆక్వా రంగం కుదుపునకు లోనైంది. ఆ తరువాత సుంకాల పెంపు వాయిదా వేశారు. కానీ ఆక్వా రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో రొయ్యల ధరలు పెరగకపోగా, వైట్, రన్నింగ్ మోర్టాలిటీ సమస్యలతో రొయ్యలను పెంచలేని పరిస్థితి.
బాపట్ల, న్యూస్టుడే: అమెరికాలో దిగుబడి సుంకాలు పెంచుతారన్న సమాచారంతో ఆక్వా రంగం కుదుపునకు లోనైంది. ఆ తరువాత సుంకాల పెంపు వాయిదా వేశారు. కానీ ఆక్వా రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో రొయ్యల ధరలు పెరగకపోగా, వైట్రట్, రన్నింగ్ మోర్టాలిటీ సమస్యలతో రొయ్యలను పెంచలేని పరిస్థితి. దీంతో సాగుదారులు వంద, తొంభై, ఎనభై కౌంటుల్లోనే రొయ్యలు పట్టి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెట్టుబడి వ్యయానికి తగినట్లుగా ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 22 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. 70 శాతం వనామీ, 30 శాతం టైగర్ రొయ్యలు పండిస్తున్నారు. మార్చి వరకు వనామీ రకం వంద కౌంట్ కేజీ రొయ్యల ధర రూ.250 ఉంది. గత ఆగస్టు నుంచి ఇదే ధర కొనసాగుతోంది. మధ్యలో రూ.260 నుంచి రూ.265 వరకు పెరిగింది. ధర బాగుందని రైతులు ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన కొత్త సీజన్లో పెద్దఎత్తున రొయ్యల సాగు చేపట్టారు. కౌలు రైతులకు భూముల లీజు ధరలు సైతం పెంచారు. ఏప్రిల్ ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రొయ్యలపై దిగుబడి సుంకం విధించడంతో పాటు ఒక్కసారి వనామీ వంద కౌంట్ రొయ్యల ధర రూ.240 నుంచి రూ.170కు పడిపోయింది. జిల్లాలో పండిస్తున్న రొయ్యల్లో 50 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని వ్యాపారులు, ప్రాసెసింగ్ కంపెనీలతో మాట్లాడి వంద కౌంట్ రొయ్యలు కేజీకి రూ.220 చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్లో రొయ్యల మేతపై దిగుమతి సుంకాలు ఎత్తివేసినా కంపెనీలు ధర మాత్రం తగ్గించలేదు. సీఎం చంద్రబాబు దృష్టికి ఆక్వా రైతు ప్రతినిధులు తీసుకెళ్లారు. సీఎం అదేశాలతో మేతపై కేజీకి రూ.4 ధరను కంపెనీలు గత నెలలో తగ్గించాయి. తర్వాత మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు వసూలు చేయాలన్నా ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ 90 రోజులు వాయిదా వేశారు. కానీ రొయ్యల ధర మాత్రం మార్కెట్లో పెరగడం లేదు.
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో ...
ఇటీవల వరకు వంద కౌంట్ కేజీ రొయ్యల ధర రూ.230గా ఉంది. గత ఫిబ్రవరి, మార్చి నెలలో సాగు చేసిన వనామీ రొయ్యలకు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగా వైట్లెట్, రన్నింగ్
మోర్టాలిటీ సమస్యలు ఎక్కువగా వచ్చాయి. రైతులు యాభై, అరవై, డెబ్భై కౌంట్లకు వెళ్లకుండా వంద నుంచి ఎనభై కౌంట్లో పే రొయ్యలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కేజీ రొయ్యల ధర రూ. 225 మాత్రమే పలుకుతోంది. వాస్తవానికి కేజీ రొయ్యల ఉత్పత్తి వ్యయం రూ. 240 వరకు ఉంటుందని రైతులు అంటున్నారు. తక్కువ ధర కారణంగా రొయ్యల ఉత్పత్తి వ్యయం కూడా దక్కక ఎకరాకు రూ. యాభై వేల నుంచి రూ. 75 వేల వరకు నష్టపోతున్నారు.