For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఎదుగుదల లేక.. దిగుబడి రాక

img

 ఎదుగుదల లేక.. దిగుబడి రాక
బహుముఖ రూపాల్లో ఎదురవుతున్న కష్టాలను అధిగమించడానికి ఆక్వా రైతులు కనిపించని యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రాణవాయువు సమస్య.. తర్వాత తెల్ల మచ్చల వ్యాధి నష్టాలు తెచ్చిపెట్టాయి. వీటిని అధిగమించితే.. వైట్రట్, రన్నింగ్ రామ్ (ఆర్ఎంఎస్).

కలిదిండి, మండవల్లి, న్యూస్టుడే: బహుముఖ రూపాల్లో ఎదురవుతున్న కష్టాలను అధిగమించడానికి ఆక్వా రైతులు కనిపించని యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రాణవాయువు సమస్య.. తర్వాత తెల్ల మచ్చల వ్యాధి నష్టాలు తెచ్చిపెట్టాయి. వీటిని అధిగమించితే.. వైట్ ట్, రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ (ఆర్ఎంఎస్), ఈహెచ్పీ (ఎటొలోతిజోన్ హెపాటోపెనియే) వ్యాధులతో అర్ధంతరంగా పట్టుబడి చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
రొయ్య పిల్ల తయారీలో నాణ్యత లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది. చిన్న చిన్న హేచరీలలో నాణ్యత తక్కువగా ఉంటుందని.. ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీలకు వెళ్లినా అక్కడా అదే సమస్యగా ఎదురవుతోంది. గత్యంతరం లేక అదే రొయ్య పిల్లలను చెరువులో వదులుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పెంచుతున్నా.. ఆశించిన స్థాయిలో రొయ్యల్లో ఎదుగుదల ఉండటంలేదు.అంచనాలకనుగుణంగా రొయ్యలు బతకడం లేదు.దీంతో కౌంటు రాకపోవడం, దిగుబడి పడిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది.మండవల్లిలో15ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్న ఓ రైతు ఒంగోలులో ప్రభుత్వ గుర్తింపు ఉన్న హేచరీ నుంచి 15 లక్షల రొయ్య పిల్లలను తెచ్చి చెరువులో వేశారు. 60 రోజుల తరువాత పట్టుబడి చేయగా.. 70 - 90 కౌంట్ ఉండాల్సిన రొయ్యలు 150 కౌంట్ వచ్చాయి. కేవలం 3.6 టన్నులే దిగుబడి వచ్చింది. రూ. 50 లక్షల పెట్టుబడికి రూ.8 లక్షలు రాబడి వచ్చింది.
ఉమ్మడి జిల్లాలో.. (లక్షల ఎకరాల్లో..) ఆక్వా సాగు మొత్తం: 2.90 రొయ్యలు : 1.10 చేపలు : 1.80

 

Languages

Shares

Related News